తెలుగు Archive

విజ్ఞాన వీచిక డెస్క్   Tue, 27 Mar 2012, IST కంపెనీ, ప్రభుత్వ సమాచారం ప్రకారం బిటి పత్తి సాంకేతికం ఇటీవల ఫలవంతమైన సాంకేతికాల్లో ఒకటి. కాయ తొలుచు పురుగు నివారణకు ఏ మందులూ వాడాల్సిన పనిలేదని, అధిక దిగుబడి వస్తుందనే లక్ష్యంతో దీని సేద్యానికి 2002, మార్చి 26న అనుమతివ్వబడింది. దీంతో బిటి సాంకేతికానికి దశాబ్దకాల అనుభవం. అయినా, 2004-05 నాటికి పత్తిలో దీని విస్తీర్ణం 5.6 శాతం మాత్రమే. ఆ తర్వాత ఇది వేగంగా విస్తరించి, [...]

రాష్ట్రంలో గత ఏడేళ్లలో 3775 మంది బలవన్మరణం; జయతి ఘోష్‌ సిఫార్సులు ఇంతవరకు అమలు చేయలేదు; ప్రభుత్వ విధానాల వల్లే ఆత్మహత్యలు; రాష్ట్రంలో తీవ్ర దురి్భక్షం నెలకొంది; ‘ఆశ’ స్వచ్ఛంద సంస్థ పరిశోధన నివేదిక న్యూఢిల్లీ – న్యూస్‌టుడే పెరుగుతున్న ఖర్చులు, తరుగుతున్న ఆదాయం, ప్రభుత్వాల సవతి తల్లి విధానాలు కలగలిపి అన్నదాతల గొంతులకు ఉరితాళ్లు పేనుతున్నట్లు ‘అలయన్స్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ హోలిస్టిక్‌ అగ్రికల్చర్‌’(ఆశా) అనే స్వచ్ఛంద సంస్థ తేల్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలను తక్కువచేసి [...]

పత్తి రైతుల ఆశలను కరవు మింగేసింది. తీవ్ర వర్షాభావంతో పంట పూర్తిగా పోవడంతో పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాక అప్పుల ఊబిలో చిక్కుకుపోయేలా చేసింది. తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడులిస్తుందని, కాసుల వర్షం కురిపిస్తుందని నల్లబజారులో అధిక ధరలకు కొని సాగుచేసిన బీటీ పత్తి ఎండలకు తట్టుకోలేక నిలువునా ఎండిపోయింది. ఈ రకం వంగడాలు రాష్ట్రంలో నెలకొన్న అధిక వేడి వాతావరణాన్ని తట్టుకోలేకపోయాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో ఏళ్లుగా పండించే సాధారణ పత్తి వంగడాలను [...]

సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, May 25th, 2011 వరిధాన్యానికి కనీస మద్దతు ధరను శాస్ర్తియ విధానంలో నిర్ణయిస్తేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుతం అవలంభిస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉంది. దాంతో రైతులు ఆర్థికంగా కుంగిపోయి జీవిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలను నిర్ణయించడానికి, వ్యవసాయేతర ఉత్పత్తుల ధరలు నిర్ణయించడానికి అసలు పొంతనే లేదు. ప్రస్తుత ధరలను 1997-98తో పోలిస్తే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కేవలం 25 శాతం పెరిగితే సిమెంట్, స్టీల్, ప్రాసెసింగ్ ఫుడ్ తదితర వస్తువుల ధరలు [...]

కాలం మారుతోంది..సామాజిక పరిస్థితులు మారుతున్నాయి. అయితే మారుతున్న తీరు కొన్నిసార్లు సమాజంలోని కొన్ని వర్గాలకు ఇబ్బందికరంగా తయారవుతుంది. సమాజానికి వ్యవసాయరంగం ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలుసు. కానీ క్రమేపీ ఆ రంగం పట్ల ఆదరణ తగ్గుతోంది. వ్యవసాయం చేసేవారిని చిన్నచూపు చూస్తున్నారు. చివరకి పరిస్థితి ఏరకంగా వచ్చిందంటే వ్యవసాయం చేసే యువకులను పెళ్లి చేసుకోమని యువతులు చెప్పేంతవరకు వెళ్లింది. ఒకప్పుడు ఒక యువకుడు వెనుక ఎంత భూమి ఉందని చూసేవారు. ఇప్పుడు ఏ ఉద్యోగం చేస్తున్నాడు, ఎంత [...]

http://eenadu.net/htm/weekpanel1.asp”>http://eenadu.net/htm/weekpanel1 110515 enabavi download PDF రైతంటే ఆత్మహత్యలే ఎందుకు గుర్తుకు రావాలి? సేద్యంలో అప్పులే ఎందుకు మిగలాలి? పొలిమేరలో కాలుపెట్టగానే క్రిమిసంహారకాల వాసనే ఎందుకు గుప్పుమనాలి? ‘రసాయన రహిత గ్రామం’గా రికార్డుకెక్కిన వరంగల్‌జిల్లాలోని ఏనెబావి… పల్లెలకు పాఠం, రైతులకు ఆదర్శం, సమష్టి కృషికి నిదర్శనం. గామీణ స్వావలంబన గురించి ఏసదస్సులో చర్చకు వచ్చినా ఆ వూరిపేరే చెబుతారు. క్రిమిసంహారకాల్లేని సేద్యం గురించి ఎక్కడ మాట్లాడాల్సి వచ్చినా ఆ వూరినే ఉదాహరణగా చూపుతారు. నీటి పొదుపు గురించి [...]

http://www.prajasakti.com/science/article-229743 విజ్ఞాన వీచిక డెస్క్ Wed, 4 May 2011, IST రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని పరిష్కరిస్తూ వ్యవసాయోత్పత్తుల అవసరాల్ని 21వ శతాబ్దంలో కూడా తీర్చడానికి రెండవ (లేదా) నిరంతర హరిత విప్లవం కావాలని పాలకులు చెపుతున్నారు. హరిత విప్లవ కాలం (1965-85) లో వ్యవసాయోత్పత్తిలో సాధించిన విజయాలు, పరిమిత స్థాయిలోనైనా, వ్యవసాయమే జీవనాధారంగా కలవారి నిజాదాయాల్ని పెంచింది. ఆ తర్వాత అమలుచేసిన సరళీకరణ, ప్రపంచీకరణ విధానాల దుష్ప్రభావాల నేపథ్యంలో ‘మరో హరితవిప్లవం’ అవసరమని పాలకులు చెపుతున్నారు. [...]

ఎండోసల్ఫాన్ అనే అత్యంత ప్రమాదకరమైన రసాయినిక పురుగు మందును అంతర్జాతీయంగా నిషేదించాలని ఈ రోజు (29 ఏప్రిల్, 2011) స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవ నగరంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. స్టాక్ హోమ్ ఒప్పందంలో భాగంగా జరిగిన చర్చల తరువాత ఈ నిర్ణయం వెలువడింది. పర్యావరణ వాదులు మరియు ఆరోగ్యకరమైన వాతావరణం కొరకు పని చేస్తున్న వ్యక్తులు మరియు సంస్థలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. ఎండోసల్ఫాన్ వాడకం వలన కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాలలో అనేక మంది అనారోగ్యం పాలు కావటం [...]

Farmers’ Income commission English కర్షకుడంటే దేశానికి వెన్నెముక అంటూ సగర్వంగా నినదించడానికి ఇప్పుడు ఎవరూ సాహసించడం లేదు. ఈ నానుడికి ప్రస్తుతం కాలదోషం పట్టినట్టే భావించవచ్చు. వ్యవసాయ రంగం మీద ఎక్కువ మంది జనం ఆధారపడితే అది బరువేనని ప్రభుత్వాలు తరచూ చెప్పడం మనం వింటున్నాం. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తన బడ్జెట్‌లో 7.4 శాతం తలసరి ఆదాయ వృద్ధి సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వృద్ధి గడచిన నాలుగేళ్ల జీవన [...]

http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=5449&Categoryid=1&subcatid=18 అన్నదాత వెన్నువిరుగుతోంది. తమ జీవితాలను శాసిస్తోన్న నాసిరకం విత్తనంపై రైతులు జరిపిన పోరాటం నిష్ఫలమని తేలిపోయింది. ఈ దేశంలో నాణ్యమైన విత్తనాన్ని ఆశించడం అత్యాశేనని రూఢీ అయింది. విత్తనంపై కంపెనీల పెత్తనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక పార్లమెంటు ఆమోదముద్ర పడడమే తరువాయి. అనేక నిరసనలు, ఆందోళనల మధ్య ఆరేళ్లపాటు ఆగిన విత్తనబిల్లు ఈ శీతాకాల సమావేశాల్లో మరలా పార్లమెంటు ముందుకు రాబోతోంది. దేశవ్యాప్తంగా వచ్చిన నిరసనలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల కేంద్ర కేబినెట్ [...]